18 ఏళ్లుగా కప్పు కోసం ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కల నెరవేరింది. తొలుత 190/9 చేసి, తర్వాత పంజాబ్ కింగ్స్(PBKS)ను 184/7కు కట్టడి చేసింది. కేవలం 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 191 టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. 72/2తో ఛేజింగ్ లో దూసుకెళ్తున్నట్లు కనిపించినా 98/4కు చేరుకుంది. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు కృణాల్. అటు భువనేశ్వర్ సైతం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పంజాబ్ ఇక కోలుకోలేదు. ఎప్పుడెప్పుడు కప్పు అందుకుంటామా అని ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లి.. 18 ఏళ్లకు అనుకున్నది సాధించాడు.