MLAలు తమ పనితీరు పరిశీలించుకోవాలంటూ PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. కార్యకర్తలు నిరాశగా ఉన్నారని, వారిలో ఆత్మస్థైర్యం నింపే బాధ్యత నాయకులదేనని గుర్తు చేశారు. చిన్న చిన్న సమస్యలు నిజమే అయినా, వాటిని దాటే ప్రయత్నం చేయాలన్నారు. ఈనెల(జూన్)లోనే PCC కార్యవర్గంతోపాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశముందని గాంధీభవన్లో అన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తేనే మరోసారి గెలుస్తామని, కొంతమంది MLAలు తమ పనితీరు బేరీజు వేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. బూత్ స్థాయి నుంచే పార్టీ నిర్మాణం జరగాలని, కార్యకర్తల్లో అసంతృప్తి తొలగిపోతేనే పార్టీకి మేలు అని అన్నారు.