మాజీ మంత్రి KTRకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ఆయన గతంలో విమర్శలు చేశారు. దీనిపై హస్తం పార్టీ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసును KTR హైకోర్టులో సవాల్ చేయగా, ఆయనకు ఊరటగా ఉత్తర్వులు వచ్చాయి. హైకోర్టు తీర్పును సుగుణ.. సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై సమాధానం చెప్పాలంటూ జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. KTRకు నోటీసులిచ్చింది.