భారత వ్యోమగామి శుభాన్ష్ శుక్లా ప్రయాణించాల్సిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక(SpaceX Falcon 9) ప్రయోగం వాయిదా పడింది. రేపు సాయంత్రం 5:52 గంటలకు బయల్దేరాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణంతో ఎల్లుండి(ఈనెల 11)కి వాయిదా వేశారు. బుధవారం సాయంత్రం ఐదున్నరకు అమెరికా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వ్యోమనౌక నింగిలోకి వెళ్లనుంది. అక్కడకు చేరేందుకు 28 గంటలు పడుతుంది. రోదసికి చేరిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ కాగా, శుభాన్ష్ శుక్లా రెండో వ్యక్తి అవుతారు. 1984లో రష్యా ఆధ్వర్యంలో సోయజ్ T-11తో ISSకు చేరుకున్నారు రాకేష్ శర్మ.