లండన్ ఫ్లైట్ కోసం 12:10 గంటలకు బోర్డింగ్ క్లోజ్.. అంటే ప్రయాణికులు 12 లోపే ఎయిర్ పోర్ట్ రావాలి. కానీ భూమి చౌహాన్ 12:20 గంటలకు వచ్చారు. 10 నిమిషాలు లేట్ అంటూ ఆమెను తిప్పి పంపారు. ఫ్లైట్ మిస్సయిందే అన్న బాధలో ఉండగానే సదరు విమానం 1:38కి టేకాఫ్ అయింది. ఎగిరిన 33 సెకన్లలోనే కూలిపోయింది. అలా అదృష్టం కలిసొచ్చి బయటపడ్డారు భూమి చౌహాన్. భర్తతో కలిసి లండన్ లో ఉంటున్న ఆమె.. రెండేళ్ల తర్వాత అహ్మదాబాద్ వచ్చారు. తిరుగు ప్రయాణం కోసం ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ట్రాఫిక్ జామ్ అయింది. రద్దీ నుంచి బయటపడి విమానాశ్రయం చేరుకునేసరికి 10 నిమిషాలు ఆలస్యమై చివరకు ప్రాణాలు దక్కించుకోగలిగారు.