25 ఏళ్ల వయసులోనే టెస్టు పగ్గాలు(Captaincy) అందుకున్న శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టిస్తాడని ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ప్రశంసించాడు. భారత్ లో ప్రధాని తర్వాత అత్యంత ప్రభావవంతమైన మూడు, నాలుగో వ్యక్తుల్లో గిల్ ఉంటాడన్నాడు. బట్లర్ IPLలో గిల్ సహచరుడే. భారత క్రికెట్ కు అరుదైన క్రికెటర్ గిల్ అని.. కోహ్లి, రోహిత్, రాహుల్, గంగూలీ తర్వాత ఆ స్థాయిలో పేరు సాధిస్తాడని నమ్మకముంచాడు. ‘మీరు IPL చుట్టే చూస్తారు.. వాస్తవానికి మీరు అలాగే జీవిస్తున్నారు.. ప్రధాని తర్వాత అత్యంత ప్రభావవంతమైన స్థానంలో గిల్ ను కూర్చోబెట్టారు.. అతడి చేతిలో అపారమైన పని ఉంది..’ అని మెచ్చుకున్నాడు.