దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపై ప్రయాణించినా టోల్ ఫీజుల భారం లేకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3 వేలతో ఏడాదిలో 200 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పిస్తోంది. కార్లు, జీపులు, వ్యాన్ల వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు ఇది వర్తించనుంది. యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటవ్వగా, ఈ ఆగస్టు 15 నుంచి అమలవుతుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక(Annual) పాసులతో ప్రయాణం సులువవుతుందని మంత్రి గడ్కరీ ట్వీట్ చేశారు. యాక్టివేషన్, రెన్యువల్ ప్రత్యేక లింక్ త్వరలో రాజ్ మార్గ్ యాప్, NHAI, MoRTH వెబ్ సైట్లలో ఉంటుంది. 60 కి.మీ. పరిధిలోని టోల్ ప్లాజాల్లో ఫీజుల బాదుడు దీనితో పరిష్కారమవుతుంది. వెయిటింగ్, రద్దీని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. https://justpostnews.com