గోదావరి-కృష్ణా నీటి కేటాయింపుల్లో తప్పు మీదంటే మీదనుకుంటున్న కాంగ్రెస్, BRS విమర్శల మధ్య.. AP CM చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటన్నారు. కాళేశ్వరం నిర్మాణంపై ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, కింది భాగంలో ఉన్న తాము ప్రాజెక్టులు కడితే నష్టమేంటన్నారు. అనుకూలంగా ఉన్న బేసిన్ల(Basins) నుంచి ఎవరికి వీలైతే వారు తీసుకోవడంలో తప్పు లేదన్నారు. కొత్త ట్రిబ్యునల్ అథారిటీ ఎలా కేటాయిస్తే ఆ విధంగానే నీటిని వాడుకుందామన్నారు.