నాలుగు రాష్ట్రాల శాససనభ(Assembly) ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం ఐదింటికి గాను గుజరాత్ లో రెండు.. పశ్చిమబెంగాల్, పంజాబ్, కేరళలో ఒక్కో స్థానానికి ఈనెల 19న పోలింగ్ జరిగింది. గుజరాత్ విసావదర్ సీటును ఆమ్ ఆద్మీకి కోల్పోయిన BJP.. మరో స్థానమైన కాడి(Kadi)ని గెలుచుకుంది. విసావదర్లో గోపాల్ ఇటాలియా, కేరళ నీలంబూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నిర్మాత ఆర్యదాన్ షౌకత్ గెలిచారు. లూథియానాలో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా 10 వేల ఓట్లతో విజయం సాధించారు. బెంగాల్ కాళీగంజ్ లో తృణమూల్ అభ్యర్థి అలీఫా అహ్మద్.. BJP నేత ఆశిష్ ఘోష్ పై 50 వేల ఓట్ల లీడ్ లో ఉన్నారు. కాడిలో BJP అభ్యర్థి రాజేంద్ర చావ్డా 40 వేల ఓట్లతో కాంగ్రెస్ నేత రమేశ్ చావ్డాపై గెలిచారు.