ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam)లో బుల్లెట్లు బయటపడటంతో కలకలం రేగింది. వీటిని గుర్తు తెలియని వ్యక్తులే వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాసవిసత్రం సమీపంలో డివైడర్ పై వాటిని గుర్తించారు. కొన్ని పెద్ద సైజు, మరికొన్ని చిన్న సైజు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మరో నాలుగు బాంబులు కూడా ఉండగా, అవి ఎక్కణ్నుంచి వచ్చాయనే దానిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూపీ లాగుతున్నారు. పట్టణంలోని సీసీ కెమెరాల్ని జల్లెడ పడుతున్నారు.