స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిందేనా అని హైకోర్టు(High Court).. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ప్రత్యేకాధికారుల్ని నియమించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని, గ్రామ పాలనా వ్యవస్థ కుంటుపడుతుందంటూ పిటిషనర్లు వాదించారు. అధికారులకు బదులు తిరిగి తమ పదవీకాలాన్ని పొడిగించాలని గతంలోనే అభ్యర్థించారు. ఈ పొడిగింపును ECతోపాటు సర్కారు సైతం వ్యతిరేకించింది. సమయానికి సర్కారు ఎన్నికలు జరపకపోతే ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉండాల్సిందేనా అంటూ కోర్టు ప్రశ్నలు వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సిన బాధ్యత ECకి లేదా అడిగింది.
గతేడాది జనవరి నుంచి దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. BC రిజర్వేషన్లు, వార్డుల విభజన, సామాజికవర్గాల వారీ ఓటర్ల లెక్కలకు గాను టైం కావాలని గత డిసెంబరులో ప్రభుత్వం కోరింది. ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రభుత్వం 30 రోజుల సమయం కోరినా, ఆ తర్వాత ప్రక్రియ జరిపేందుకు మరో 60 రోజుల గడువు తమకివ్వాలని EC కోరింది. తీర్పు రిజర్వ్ చేస్తూ కోర్టు ఏం చెప్పిందంటే… క్లిక్ చేసి చదవండి… https://justpostnews.com