గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మూడు నెలల్లో నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు(High Court) ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి కావాలని, ఈ ఎన్నికల ప్రక్రియంతా 2025 సెప్టెంబరు 30లోపు ముగించాలని జస్టిస్ టి.మాధవిదేవి ఆదేశించారు. సకాలంలో ఎలక్షన్లు నిర్వహించట్లేదంటూ 6 పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలుంటాయన్నా.. ఎందుకు ఆలస్యం చేశారంటూ మొన్న న్యాయస్థానం ప్రశ్నలు వేసింది. అందుకు సమయం కావాలని సర్కారు కోరింది. EC సైతం 60 రోజుల గడువు అడిగింది. పదవీకాలం పూర్తయిన ఆరు నెలల్లోపే ఎన్నికలుండాలన్న రూల్ ను గుర్తు చేసిన పిటిషనర్లు.. అలా కానప్పుడు తమనే కొనసాగించాలని కోరారు. సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసింది. https://justpostnews.com