భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) రోదసి ప్రయాణం మొదలైంది. చంద్రుడిపై 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలి అడుగు వేయగా.. ఇప్పుడు అదే వేదిక నుంచి బయల్దేరారు శుక్లా. ఇస్రో-నాసా మిషన్ ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అక్కడకు చేరుకోవడానికి 28 గంటలు పడుతుంది.
ఈ పర్యటన ఇందుకే…
@ నలుగురిలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా.. రోదసిలోకి అడుగుపెడుతున్న రెండో భారతీయుడు. 1984 రాకేష్ శర్మ రోదసి వెళ్లొచ్చారు.
@ భారత్ కు ఇది ప్రతిష్ఠ్మాత్మక ప్రాజెక్టు.. 30 దేశాలకు చెందిన 60 ప్రయోగాలు చేస్తారు.
@ 2 వేల గంటల పాటు యుద్ధ విమానం నడిపిన 39 ఏళ్ల శుక్లా.. భారత వైమానిక దళంలోనూ గ్రూప్ కెప్టెన్.
@ ఇస్రో, నాసా ఆధ్వర్యంలో మెంతి, పెసలు వంటి పంటల సాగు వంటి వాటిపై అధ్యయనం చేస్తారు.
@ రెండో దశలో భూమధ్య రేఖకు 413-423 కిలోమీటర్ల వద్ద సర్క్యులర్ ఆర్బిట్ లో ప్రవేశించారు.
@ అక్కడ ఈ వ్యోమగాములు స్పేస్ సూట్ లో బయటకు వస్తారు.