రాజ్యాంగం, పార్లమెంటు రెండింట్లో భారత రాజ్యాంగమే అత్యున్నతమని CJI బి.ఆర్.గవాయ్ అన్నారు. పార్లమెంటుకు సవరించే అధికారమే కానీ, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేదన్నారు. 52వ CJI అయ్యాక స్వస్థలం మహారాష్ట్ర అమరావతిలో జరిగిన సత్కార సభలో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థల్లో ఏది ఉన్నతమన్న చర్చ నడుస్తుంటుంది.. పార్లమెంటే గొప్పదని కొందరంటారు.. రాజ్యాంగమే మహోన్నతమైంది.. ఆ 3 విభాగాలు దాని కిందే పనిచేస్తాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఆదేశాలిస్తే జడ్జి స్వతంత్రంగా మారబోరు.. పౌర హక్కులు, రాజ్యాంగ విలువలకు సంరక్షకులమని గుర్తుంచుకోవాలి.. అది అధికారం మాత్రమే కాదు, జడ్జికి ఒక విధి.. తీర్పు గురించి ఏమనుకుంటారో అనే భావన జడ్జికి మార్గనిర్దేశం కాకూడదు..’ అన్నారు. ఆర్కిటెక్ట్ కావాలనుకున్నా తన తండ్రి మాత్రం న్యాయవాది అవ్వాలనుకున్నారని బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.