కార్పొరేట్(Corporate) రంగంలో మరో పెద్ద డీల్ కుదిరింది. రూ.8,986 కోట్లతో అక్జో(Akzo) నోబెల్ ఇండియా లిమిటెడ్(ANIL)ను JSW పెయింట్స్ సొంతం చేసుకుంది. ANILతోపాటు దాని సహ సంస్థల్లోని 74.76 శాతం ఓనర్ షిప్.. JSW సొంతమవుతుంది. ANIL షేర్ హోల్డర్ల నిర్ణయం తర్వాత ఈ డీల్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఆమోదం తెలపాల్సి ఉంది. 23 బిలియన్ల(రూ.1.96 లక్షల కోట్లు) సంపద కలిగిన భారత అతిపెద్ద పెయింట్స్ కంపెనీ.. సంస్థను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పెయింట్స్ కే పరిమితం కాకుండా స్టీల్, సిమెంట్, విద్యుత్తు సదుపాయాలు, ఆటోమోటివ్స్ రంగాల్లో అడుగుపెట్టబోతుంది. ANIL హోల్డ్స్ సైతం అక్జోనోబెల్ అనే నెదర్లాండ్స్ కంపెనీతో కలిసి పెయింట్స్ సెక్టార్ లో మంచి పేరు సంపాదించింది.