
తిరుమల కాలి నడక(Walk Way) మార్గంలో మరో చిరుత పులి బోనుకు చిక్కింది. గత రెండున్నర నెలల కాలంలో ఆరు చిరుతలు పట్టుబడ్డాయి. నడక దారిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే ఈ చిరుత కూడా పట్టుబడటం విశేషం. నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలికను పొట్టనబెట్టుకున్న వన్యమృగాల కోసం.. ఫారెస్టు డిపార్ట్ మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. నడక దారిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుతలు తిరుగుతున్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే.
500 కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేయడంతో క్రమంగా ఒక్కో చిరుత అందులో చిక్కుకుంటోంది. వీటిని శ్రీవేంకటేశ్వర జూ పార్క్ కు తరలిస్తున్నారు.