బంగారం(Gold) ధర ఏడాది కాలంలో రూ.23,000 పెరిగింది. గత ఏప్రిల్లో 24 క్యారెట్లు గల 10 గ్రాముల ధర రూ.75,500 కాగా.. ఈ ఏప్రిల్లో రూ.98,260కి చేరింది. ఈ లెక్కన 25% మేర ధర పెరిగింది. వివిధ దేశాల మధ్య ట్రేడ్ వార్(Trade War) ఇందుకు కారణమంటున్నారు. అయితే ఇదొక్కటే కాదని, ఇన్వెస్టర్లు బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్నందునే రేట్లు పెరుగుతున్నాయట. కరోనా తొలి రోజుల్లో 2020 ఏప్రిల్లో రూ.45,000 ఉండగా, అదే ఏడాది ఆగస్టుకు రూ.57 వేలకు చేరింది. కానీ 2021 ఏప్రిల్ నాటికి మళ్లీ రూ.46 వేలకు చేరింది.
స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సందర్భాల్లో రేట్లు పెరగుతూ, సాధారణ స్థితి వచ్చాక తగ్గుతుంటుంది. అయితే పెట్టుబడి సాధనంగా స్వర్ణాన్ని చూడొద్దని నిపుణులు అంటున్నారు. ఈక్విటీ మార్కెట్లు ఇచ్చినంత లాభం సుదీర్ఘకాలంలో బంగారం ఇవ్వలేదని చెబుతున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు చక్కబడ్డాక ధరలు భారీస్థాయిలో దిగివచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఏడాదిలో ఎంత శాతం పెరిగిందో ఆ స్థాయిలోనే దిగివచ్చే అవకాశాలున్నాయట.