ఆర్థిక వ్యవస్థల్ని అవస్థల పాలు చేసే యుద్ధాలతో బంగారం రేట్లు పెరుగుతాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే డిమాండ్ తో ధర పెరుగుతుంది. ఇజ్రాయెల్-ఇరాన్ వార్ తో పుత్తడి(Gold) ధరకు రెక్కలొస్తాయంటున్నా.. అది నిజం కాదట. అమెరికా సిటీ బ్యాంక్, బ్లూంబర్గ్ రిపోర్ట్స్ ప్రకారం 2025 జులై కల్లా స్వల్పంగా, 2026 జూన్ నాటికి మరింతగా దిగి రానున్నాయి. డిమాండ్ తగ్గడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరే ఛాన్స్ వల్ల రేట్లు తగ్గనున్నాయి. గతేడాది 45%, ఈ సంవత్సరం 30% శాతం మేర స్వర్ణం ధర పెరిగింది. తాజా యుద్ధంలో తొలి వారం రేట్లు పెరిగినా తర్వాత తగ్గుతూ వస్తోంది. ఒకట్రెండు నెలల్లో 10% దాకా తగ్గొచ్చని ప్రకటించాయి. ప్రస్తుతం ఔన్సుకు 3,371 డాలర్లుంటే ఇది 3 వేల డా.కు.. 2026లో 2,700 డాలర్లకు తగ్గనుంది. 2025 జనవరిలో 2,600 డాలర్లున్న ధర ప్రస్తుతం 3,371 డా.కు చేరగా, మళ్లీ దిగివస్తుందని నివేదికల్లో తేలింది. https://justpostnews.com