ఆదాయపన్ను(IT) రిటర్న్స్ దాఖలును IT శాఖ పొడిగించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల దాఖలు గడువు 2025 జులై 31 ముగిసిపోతుంది. దాన్ని సెప్టెంబరు 15 వరకు పొడిగించి చెల్లింపుదారులకు వెసులుబాటు(Relaxation) కల్పించింది. ITR ఫామ్స్ లో తీసుకొచ్చిన నూతన విధానాలకు అనుగుణంగా మార్పులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే గడువు పొడిగిస్తూ IT విభాగం నిర్ణయం తీసుకుంది.