
అమెరికా ఆర్థిక వ్యవస్థ(US Economy)కు ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘పన్నుల ఆదాయమంతా వడ్డీలకే సరిపోతుంది.. మరేమీ మిగలదు.. ఇదిలాగే కొనసాగితే అమెరికా దివాలా తీస్తుంది.. మొత్తం ఆదాయంలో 25% అంటే వడ్డీ.. 37 ట్రిలియన్ డాలర్ల రుణాలకే పోతోంది.. 1980ల్లో ఒక ట్రిలియన్ ఉంటే 2025 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల మేర వడ్డీలు పెరిగాయి..’ అని ట్వీట్ చేశారు. ‘భయంకరంగా ఉంది’ అన్న ఒక్క మాటతో ట్వీట్ వైరలై కొన్ని గంటల్లోనే 1.4 కోట్ల వ్యూస్ తెచ్చింది. అయితే తాము ఎంతకాలం రుణాలు తీసుకోగలమోనంటూ అక్కడి చట్టసభల సభ్యులు చర్చల్లో పడ్డారు. సర్కారును నడపడానికి ఇప్పటికే ట్రెజరీ డిపార్ట్మెంట్… IRSను 2 వేల కోట్ల డాలర్లు కోరడాన్ని మస్క్ గుర్తుచేశారు.