జూన్ 12న అహ్మదాబాద్ లో విమానం కూలిపోయాక.. ఫ్లైట్లలో వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ప్రయాణ భయంతో టికెట్ల రద్దు బాగా పెరిగింది. గతంలో నెలకు 10 వరకు వచ్చే థెరపీ కోర్సు కేసులు 100కు పెరిగాయని ఒక డాక్టర్ తెలిపారు. విమాన శబ్దాలు(Sounds), కదలికను ఊహించుకుంటూ నిద్రలేమితో బాధపడుతున్నారని రిటైర్డ్ వింగ్ కమాండర్ కె.దినేశ్ ఒక వార్తా సంస్థతో అన్నారు. బుకింగ్స్ 15-20% తగ్గి, 30-40% క్యాన్సిల్ అవుతున్నాయి. ప్రయాణికులు ప్రస్తుతం విమానం ఏ రకానికి చెందింది, ఏ కంపెనీది అన్న రీతిలో ఫిల్టర్ చేస్తున్నారు. డ్రీమ్ లైనర్లు, బోయింగ్ లు దూరంగా ఉంటున్నారని గుర్తించారు. విమానమంటేనే వామ్మో అని పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు.