మలయాళ(Mollywood) చిత్రసీమకు మోహన్ లాల్ పెద్ద దిక్కయ్యాడు. 2025లో రూ.500 కోట్ల కలెక్షన్ల రికార్డు సాధించాడు. గతేడాది మలైకొట్టాయ్(Malaikottai) వాలిబన్(రూ.29.75 కోట్లు), బారోజ్ 3D(రూ.15.1 కోట్లు)తో వరుస ఫ్లాపులు రాగా.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో వసూళ్లు రాబట్టాడు. 1980లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. మార్చిలో వచ్చిన ఎల్2 ఎంపురాన్ తో రూ.265.5 కోట్లు వసూలు చేశాడు. మలయాళంలో ఇది రికార్డు కాగా, దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఏప్రిల్లో విడుదలైన తుడరమ్.. రూ. 234.5 కోట్లు తెచ్చింది. ఇలా ఈ రెండు మూవీలు రూ.500 గ్రాస్ కలెక్షన్స్ ను సాధించాయి.