పూరీ రథయాత్ర ఈ నెల 27న ప్రారంభమవుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర గుండిచా ఆలయానికి చేరుకునే ఊరేగింపులో లక్షలాదిగా పాల్గొంటారు. ప్రతి హిందువు దర్శించి తరించాలనుకునే ఈ యాత్రకు.. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఆషాఢ మాసంలో జరిగే వేడుక కోసం ఒడిశా CM మోహన్ చరణ్ మాఝీ సమీక్ష చేశారు. ఈనెల 26 గుడిని శుభ్రం చేసి తెల్లారి యాత్ర నిర్వహిస్తారు. 9 రోజుల వేడుకలో దేవదేవుళ్ల తిరుగుప్రయాణం జులై 5న ఉంటుంది. ఏటా కొత్త కలపతో రథం తయారీకి వెయ్యి చెక్కల్ని ఉపయోగిస్తారు. గతేడాది బలభద్రుని విగ్రహాన్ని దించుతుండగా ఒరిగి తొక్కిసలాట జరిగింది. అప్పుడు 9 మంది గాయపడగా, ఈసారి అలా జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.