గోవుల సంరక్షణకు ప్రత్యేక విధానాన్ని(Policy) రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. CM ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, దేవదాయ, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీ ఏర్పాటైంది. సవ్యసాచి ఘోష్, రఘునందన్ రావు, శైలజ రామయ్యర్ తో కూడిన బృందం.. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తుంది. భక్తులు దానంగా ఇచ్చిన గోవులు మృత్యువాత పడుతున్నందున ఈ చర్యలు చేపట్టింది. తొలి విడతగా వేములవాడ, యాదగిరిగుట్ట, ఎన్కేపల్లి, పశువైద్య వర్సిటీలో గోశాలల్ని నిర్మిస్తారు. ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడలో 100 ఎకరాల్లో గోశాల ఉండాలని CM స్పష్టం చేశారు.