‘ఛార్ ధామ్’ యాత్రపై ఉత్తరాఖండ్(Uttarakhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా హెలికాప్టర్(Helicopter) సర్వీసుల్ని నిలిపివేసింది. అయితే ఆ ఆలయాల వద్దే ఉన్న భక్తుల్ని వెనక్కు తెచ్చేందుకు మాత్రం హెలికాప్టర్లకు అనుమతినిచ్చింది. హిమాలయాల్లోని కేదార్ నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రిని ‘చతుర్ ధామ(ఛార్ ధామ్)’ యాత్రగా భావిస్తారు. మే 2న కేదార్ నాథ్ దర్శనాలు ప్రారంభం కాగా.. ఛార్ ధామ్ యాత్ర అధికారికంగా అక్షయతృతీయ అయిన ఏప్రిల్ 30న మొదలైంది.