పశ్చిమాసియా ఉద్రిక్తతల(Conflicts)తో గల్ఫ్ దేశాలకు రాకపోకలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఖతార్ దోహాలోని అమెరికా ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడికి దిగడంతో.. యుద్ధం మిగతా దేశాలకు పాకింది. దీంతో గల్ఫ్ లోని అన్ని దేశాలకు విమానాల్ని రద్దు చేసింది ఎయిర్ ఇండియా. తూర్పు తీర, ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు సైతం ట్రిప్పులను నిలిపివేసింది. ఐరోపా(Europe), అమెరికా రాకపోకలు సాగించే ఫ్లైట్లు.. పశ్చిమాసియా గగనతలం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే ఖతార్, బహ్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు గగనతలాన్ని మూసేశాయి. విదేశాంగ శాఖ తదుపరి ఆదేశాల వరకు అన్ని ఫ్లైట్లను రద్దు చేస్తూ ఎయిరిండియా నిర్ణయం తీసుకుంది. https://justpostnews.com