ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ఇచ్చిన ప్రకటనతో.. ఆయనకే పెద్ద షాక్ తగిలింది. తాడోపేడో తప్ప తగ్గేది లేదని ఇరాన్ కరాఖండీగా చెప్పేసింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి(Abbas Araghchi) రివర్సయ్యారు. అర్థరాత్రి నుంచి గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మూడో ప్రపంచ యుద్ధమేనా అన్నట్లు అన్ని దేశాల్లో అలజడి మొదలైంది. తమపై ఇరాన్ దాడితో.. ఎదురుదాడికి ఖతార్ రెడీ అయింది. బహ్రెయిన్ సైతం అలర్టయింది. పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాల్ని మూసేశాయి. ఇక ఖమేనీ-నెతన్యాహు ప్రభుత్వాలు మిసైళ్లు విసురుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి అస్థిరత మధ్య ట్రంప్ ప్రకటనతో వార్ ముగిసిందని భ్రమ పడ్డా ఇరాన్ ప్రకటనతో సీన్ రివర్సయింది.