భారత్ లో పేదరికం భారీగా తగ్గినట్లు ‘పావర్టీ & షేర్డ్ ప్రాస్పెరిటీ’ రిపోర్టులో ప్రపంచ బ్యాంకు(World Bank) తెలిపింది. 2011-12లో 27.1% ఉంటే, 2022లో 5.3%నికి తగ్గింది. నాడు 35 కోట్ల మంది పేదలుంటే 2022-23లో ఏడున్నర కోట్లకు చేరింది. ఈ 11 ఏళ్లల్లో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది పాక్ జనాభా కన్నా ఎక్కువ. దేశంలో 65% మంది పేదలు UP, మహారాష్ట్ర, బిహార్, బెంగాల్, మధ్యప్రదేశ్ లోనే ఉండేవారు.
ఇక పాకిస్థాన్ పేదరికంతో అల్లాడుతోంది. 2017లో అక్కడ 4.9% పేదలుంటే 2021లో 16.5 శాతానికి చేరింది. రోజుకు రూ.350 లోపు సంపాదించేవారు 2017లో 39.8 శాతం ఉంటే, 2021లో 45 శాతానికి పెరిగింది. నిధుల గోల్ మాల్, ఉగ్రవాదంతో అప్పుల్లో కూరుకుపోయింది. IMF, వరల్డ్ బ్యాంక్, ADB, ఇస్లామిక్ అభివృద్ధి బ్యాంక్ సహా సౌదీ, UAE వేల కోట్లిస్తున్నా అన్నీ పక్కదారి పడుతున్నాయి. ఆ దేశ అప్పు రూ.23 లక్షల కోట్లకు చేరింది.