ఉగ్రవాదుల అప్పగింత, PoKను ఖాళీ చేయడం మినహా మరే చర్చలు ఉండవని భారత్ మరోసారి తెగేసి చెప్పింది. మోదీ సర్కారుతో చర్చలకు సిద్ధమంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ‘ఇరుదేశాల చర్చలంటూ ఉంటే అది ఉగ్రవాదం, PoKపైనే.. ఇది తప్ప వేరే అవసరం లేదు.. హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టుల్ని అప్పగించాల్సిందే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఖాళీ చేసేందుకు మాత్రమే చర్చిద్దాం..’ అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. సింధు జలాల్ని ఆపేయడంతో పాక్ ఎడారిగా మారింది. అటు ‘ఆపరేషన్ సిందూర్’ ముగియలేదని ప్రధాని మోదీ బెంగాల్ లో అన్నారు.