సింధు జలాలు ఆపేయడాన్ని ప్రశ్నించిన పాకిస్థాన్ కు భారత్(Bharath) గట్టి బుద్ధి చెప్పింది. ఐరాస శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్.. దాయాది దేశాన్ని UN వేదికపై ఎండగట్టారు. గత 4 దశాబ్దాల్లో 20 వేల మంది భారతీయులు పాక్ ఉగ్రదాడులకు బలయ్యారని గుర్తు చేశారు. ‘నీరు జీవితంలో భాగం.. అది యుద్ధంలో ఆయుధం కాదు.. 65 ఏళ్లుగా నీటిని ఇస్తూనే ఉన్నాం.. కానీ మీరేం చేశారు.. ఉగ్రవాదుల్ని మాపైకి ఉసిగొల్పారు.. వేలాదిగా దాడులు జరుగుతుంటే స్నేహం ఎక్కడుంటుంది..’ అని వార్నింగ్ ఇచ్చారు. 1960 ఏప్రిల్ 23న చేసుకున్న ఒప్పందాన్ని.. పహల్గామ్ దాడి తర్వాత భారత్ నిలిపేసింది.