అణు పరీక్షల్నే నమ్ముకుని అమెరికాకు సవాల్ విసిరిన ఇరాన్.. ఒక్క పరీక్షయినా చేయలేని స్థితికి చేరింది. ఇజ్రాయెల్ దాడుల్లో 9 మంది శాస్త్రవేత్త(Scientists)లు మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) ప్రకటించగా, టెహ్రాన్ నాయకత్వం ధ్రువీకరించాల్సి ఉంది. న్యూక్లియర్ సెంటర్లు, బాలిస్టిక్ మిసైల్స్ ప్రొడక్షన్ ఏరియాలు, కమాండ్ సెంటర్లపై దాడులు జరగడంతో ఇరాన్ ఆయుధ వ్యవస్థ నాశనమైంది. దీనికి గట్టి జవాబు చెబుతున్న ఆ దేశం.. జెరూసలెం, టెల్ అవీవ్ పై రాకెట్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. 200 మిసైళ్లను నెతన్యాహూ సర్కారు కూల్చేసినా, ఇరాన్ దాడిలో 9 మంది ఇజ్రాయెలీలు గాయపడ్డారు.