అణు స్థావరాలే(Nuclear Sites) లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టం కలిగింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట చేపట్టిన వైమానిక, మిసైల్ దాడుల్లో.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్(IRG) చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ హతమయ్యారు. ఈ విషయాన్ని టెహ్రాన్ నాయకత్వం ప్రకటించింది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఎయిర్ కమాండర్ తోపాటు పలువురు అణు శాస్త్రవేత్తలు(Scientists) మృతిచెందినట్లు వార్తలు వస్తున్నా ధ్రువీకరించాల్సి ఉంది. అణు కార్యక్రమాలపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(IAEA).. ఇరాన్ కు 20 ఏళ్ల తర్వాత వార్నింగ్ ఇచ్చింది. అయినా కార్యక్రమాల్ని ఆపేది లేదంటూ మొండికేయడంతో ఇజ్రాయెల్ దాడికి దిగింది.