DMK ఎంపీ కనిమొళి నేతృత్వంలోని బృందం.. ‘ఆపరేషన్ సిందూర్’ను రష్యా(Russia)కు వివరించింది. సంక్లిష్ట కాలంలో పెద్దన్నలా నిలిచారని కొనియాడింది. రెండ్రోజుల టూర్లో విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో, మాజీ ప్రధాని మిఖాయిల్ ఫ్రాడ్కోవ్ సహా ముఖ్య నేతల్ని MPలు కలిశారు. నెహ్రూ, వాజ్ పేయి నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు.. పాక్ తో సంబంధాల్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశామన్నారు. కానీ మత సామరస్యాన్ని దెబ్బతీసేలా అవతలి వైపు నుంచి ఉగ్రదాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. MPలు సమాజ్ వాదీ నుంచి రాజీవ్ రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున అల్తాఫ్ అహ్మద్, BJP నుంచి కెప్టెన్ బ్రిజేశ్ చౌతా, RJD ప్రేమ్ చంద్ గుప్తా ఆ టీంలో ఉన్నారు.