ప్రధాని మోదీపై ఇటలీ PM జార్జియా మెలోని ప్రశంసలు కురిపించారు. G-7 సదస్సు(Summit) సందర్భంగా ఈ ఇద్దరూ కెనడాలో భేటీ అయ్యారు. మోదీకి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోని షేర్ చేస్తూ మెలోని… ‘మీరు అందరికన్నా ఉత్తములు(యూ ఆర్ ద బెస్ట్).. మీలా ఉండాలని కోరుకుంటున్నా.. ఇండియా-ఇటలీది దృఢమైన స్నేహం.. ఇదిలాగే కొనసాగాలి..’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మోదీ… ‘మీతో ఏకీభవిస్తున్నా.. రెండు దేశాల బంధం మరింత బలంగా మారుతుంది.. ఇరుదేశాల ప్రజలకు ఇది ఎంతో లాభం..’ అని జవాబిచ్చారు. COP28 సమ్మిట్ సందర్భంగా ఈ ఇద్దరూ నేతలు ఈ ఏడాదే దుబాయిలో కలుసుకున్నారు. ఆ సమయంలో మోదీతో సెల్ఫీ తీసుకున్నారు మెలోని.