బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్ కు ప్రధాని మోదీ పంచ్ తగిలింది. షేక్ హసీనా(Sheik Hasina) నోరు మూయించండంటూ మోదీకి బంగ్లా చీఫ్ కాల్ చేశారు. ఆ విషయంతో మాకేం పని.. సోషల్ మీడియాను ఆపగలమా అంటూ ప్రధాని జవాబిచ్చారని స్వయంగా యూనసే ప్రకటించారు. ‘నేను మోదీతో ఇలా అన్నా.. మీరు ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటే వద్దని బలవంతం చేయలేను.. కానీ బంగ్లాదేశ్ మొత్తం కోపంగా ఉనండటంతో ఆమె మాట్లాడకుండా చూడండి.. నేను అడిగినట్లు భారత్ సహాయం చేయట్లేదు.. ఇది సోషల్ మీడియా అని చెప్పి మీరు దూరంగా ఉండలేరు..’ అని అన్న మాటల్ని యూనస్ గుర్తు చేశారు.