చిన్న ద్వీపమైన సైప్రస్(Cyprus)ను మోదీ సందర్శించడానికి ప్రధాన కారణముంది. పాక్ కు మద్దతిస్తున్న తుర్కియేకు షాక్ ఇచ్చేందుకే ఈ పర్యటన. 1974 నుంచి తుర్కియే-సైప్రస్ మధ్య వివాదముంది. ఈ చిట్టి దేశంలోని మూడింట ఒక వంతు భూభాగాన్ని ఆక్రమించి, EU సభ్యత్వం రాకుండా అడ్డుకుంటోంది. తుర్కియే-పాక్ బంధాన్ని అడ్డుకోవడం, టర్కిష్ విస్తరణ వాదానికి చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యం. ఇక భారత్ కు అండగా ఉండటం.. తూర్పు మధ్యధరా తీరంలో కీలకం, టర్కీ-సిరియాకు పొరుగు దేశం, యూరప్ వాణిజ్యానికి ప్రవేశ ద్వారంగా ఉండే సైప్రస్ మనకు ఎంతో కీలకం. ఆసియా-ఐరోపా-మధ్య ప్రాచ్యం అనుసంధానానికి ఇది అత్యంత ప్రధానంగా ఉంది.1982లో ఇందిర, 2002లో వాజ్ పేయి సైప్రస్ ను సందర్శించారు.