పాకిస్థాన్ బండారం బయటపడింది. కాల్పుల విరమణ(Ceasefire)ను తామే అడుక్కున్నామని ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఒక టీవీ ఛానల్ తో అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్ లో రాత్రి 2:30కు నూర్ ఖాన్, షోర్కోట్ వైమానిక స్థావరాల్ని భారత్ ధ్వంసం చేసింది.. ఇవి పాక్ కు అత్యంత ప్రధానమైనవి.. ఆ టైంలో జోక్యం కోసం అమెరికాను వేడుకున్నాం.. మిసైల్స్ పడ్డ 45 నిమిషాలకు సౌదీ యువరాజు ఫైసల్ ఫోన్ చేశారు.. నాతో మాట్లాడిన విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోకు తెలిపారు.. జైశంకర్ తో మాట్లాడి యుద్ధం ఆపిస్తే మీరు రెడీనా అని నన్ను యువరాజు అడిగారు.. నేను అవును అని చెప్పడంతో ఆయన జైశంకర్ తో మాట్లాడారు.. తిరిగి ఆ విషయాన్ని నాకు తెలియజేశారు.. ఇలా మేం దిగిరావడంతోనే యుద్ధాన్ని భారత్ ఆపేసింది..’ అని పాక్ డిప్యూటీ PM నిజాన్ని ఒప్పుకున్నారు.