సింధునది నీరు రాక పాక్ దిక్కుతోచని స్థితికి చేరుకుంది. సింధుజలాల ఒప్పందాన్ని తిరిగి తేవాలంటూ భారత్ కు లెటర్ల మీద లెటర్లు రాస్తోంది. అయితే దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ అన్నారు. నీళ్లివ్వకుంటే యుద్ధమే అంటూ బిలావల్ భుట్టో అనడాన్ని అదో రాజకీయ డ్రామాగా పోల్చారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత నీటిని భారత్ ఆపేసింది.