భారత్ తో యుద్ధం వస్తే పాకిస్థాన్ పని 4 రోజుల్లోనే ఖతమవుతుందని వార్తా సంస్థ ANI అంచనా వేసింది. మందుగుండు కొరతతో కేవలం 96 గంటలు మాత్రమే పోరాటం చేస్తుందని, ఇది సైన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోందని తెలిపింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సదుపాయాలు లేక, కెపాసిటీ మేరకు ఉత్పత్తి జరగక చేతులెత్తేస్తుందట. ఈనెల 2న జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్ల భేటీలో ఈ అంశమే ప్రధాన చర్చకు వచ్చింది. పాక్ దీనస్థితి గురించి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా గతంలోనే హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, అప్పులు పెరగడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గడంతో దాయాది తొందరగానే ఓడిపోనుందని స్పష్టం చేసింది. తాజా ఘర్షణల దృష్ట్యా భారత్ సరిహద్దుల్లో ఆయుధ డిపోల్ని(Ammunition Depots) నిర్మిస్తున్నా అవి నడపడానికి నిధులు లేవని తెలిపింది.