ఇజ్రాయెల్-ఇరాన్ వార్ ప్రపంచ యుద్ధంగా మారబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇజ్రాయెల్ కు US సహకరిస్తుందన్న వాదనల నడుమ రష్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మిలిటరీ యాక్షన్ కు దిగితే అమెరికా పెద్ద తప్పు చేసినట్లేనని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా జఖరోవా(Zakharova) అన్నారు. ఇరాన్లోని బుషెహర్ అణు ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడులతో యురేనియం లీకయ్యే ప్రమాదముందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) హెచ్చరించింది. ఈ ప్లాంటు ఇరాన్ అధీనంలో ఉన్నా అక్కడ పనిచేసే నిపుణులంతా రష్యన్లే. అందులో వాడే ఫ్యూయల్ సైతం పుతిన్ సర్కారుదే. ఇలా పశ్చిమాసియా యుద్ధం కాస్తా ప్రపంచ గొడవగా మారింది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.