అమెరికాలో అడుగుపెట్టిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Munir)కు.. సొంత దేశస్థుల నుంచే అవమానం ఎదురైంది. ఎంత పెద్ద వ్యక్తినైనా డేగకళ్లతో పరిశీలించే అగ్రరాజ్యం.. ఆయన్ను ఏకంగా వైట్ హౌజ్ కే పిలిచింది. ISI చీఫ్ అసిమ్ మాలిక్, మునీర్.. ట్రంప్ తో గంటపాటు భేటీ అయ్యారు. తనకు నోబెల్ ప్రైజ్ సపోర్ట్ చేసినందుకే పిలిచానని ట్రంప్ అన్నా.. అసలు కారణం వేరే ఉంది. యుద్ధంలో ఇరాన్ కట్టడికే పాక్ తో స్నేహమని తెలుస్తోంది. https://justpostnews.com
భారత్-పాక్ యుద్ధం ఆపానని బీరాలు పలికిన ట్రంప్.. మాట మార్చడం వెనకా మర్మం దాగుంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తలదూర్చాలంటే భారత్-పాక్ తోనే సాధ్యం. ఈ విషయంలో భారత్ తటస్థంగా ఉంటుందని గ్రహించిన అమెరికా.. ఇక పాక్ ను మచ్చిక చేసుకుంటోంది. అందుకే అక్కరకు రాని ఆర్మీ చీఫ్ కు సైతం రెడ్ కార్పెట్ వేసింది.