అడ్డగోలు సుంకాలు(Tariffs) వేసిన డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. అధికారాల్ని అతిక్రమించారంటూ ముగ్గురు జడ్జిల మన్ హట్టన్(Manhattan) కోర్టు మండిపడింది. ‘అసాధారణ లేదా సాధారణ ముప్పున్నప్పుడు మాత్రమే ఆంక్షలు విధించే అధికారం ప్రెసిడెంట్ కు రాజ్యాంగం ఇచ్చింది.. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్(IEEPA) కింద ‘అపరిమిత’ అధికారాలు ఉన్నాయన్న వాదన తప్పు.. ఆర్థిక వ్యవస్థ రక్షణకు అధికారాలు అతిక్రమించని హక్కుల్నే రాజ్యాంగం ఇచ్చింది తప్ప ఇష్టమొచ్చినట్లు కాదు..’ అని తలంటింది. చైనాతో సంఘర్షణ, భారత్-పాక్ యుద్ధం ట్రంప్ సుంకాలతోనే ఆగాయని కమాండర్-ఇన్-చీఫ్ చెప్పగా.. టారిఫ్స్ విధించడం అవివేకం, అసమర్థమైనది అంటూ తీర్పునిచ్చింది.
.