యుద్ధంలో పాక్ కు అండగా నిలిచిన తుర్కియే(Turkiye).. కార్గో విమానంలో ఆయుధాలు పంపింది. అజర్ బైజాన్ తప్ప ‘ఆపరేషన్ సిందూర్’ను ఖండించిన ఒక్క ముస్లిం దేశమూ లేదు. దక్షిణాసియాలో అత్యంత సన్నిహితురాలు పాకేనని నమ్మింది తుర్కియే. కానీ భారత్ మాత్రం.. భూకంపం వచ్చినపుడు ఆ దేశానికి భారీ సాయాన్నందించింది. రష్యా నుంచి S-400 కొన్నప్పుడూ ఎర్దోగాన్ సర్కారు అభ్యంతరం చెప్పింది. ఆ దేశం తీరును గమనించిన ఇజ్రాయెల్, UAE.. తుర్కియేతో ఒప్పందం గల ఆయుధ టెక్నాలజీని నిలిపేశాయి. సౌదీ అరేబియా దూరంగా ఉంది. భారత్ ను కాదని పాక్ ను ఎంతకాలం నమ్ముకుంటుందన్న భావన ప్రపంచ దేశాల్లో ఉంది. మారిన భారత విదేశాంగ విధానంతో.. చాలా ముస్లిం దేశాలు తుర్కియేకు దూరంగా ఉంటున్నాయి. భారతీయుల దెబ్బతో ఆ దేశ టూరిజానికి పెద్ద తగిలి, ఈ కొద్దికాలంలోనే రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… https://justpostnews.com/international/why-turkiye-chosen-pakistan-with-india-conflicts/