ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో మానవ మేధకు ప్రమాదమని, ఉద్యోగాలు ఉండవన్న భయాల నడుమ గూగుల్(Google) CEO పూర్తి క్లారిటీ ఇచ్చారు. మానవ ప్రతిభకు AI ప్రత్యామ్నాయం కాదని, అది కేవలం యాక్సిలరేటర్(వేగం పెంచే సాధనం)గా పనిచేస్తుందన్నారు. సంస్థల టెక్నికల్ సిస్టమ్స్ అభివృద్ధికి AI ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందని బ్లూమ్ బర్గ్ టెక్ కాన్ఫరెన్స్ లో అన్నారు. పోటీ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటివి వేలాది మందిని తొలగిస్తుండగా.. అందుకు భిన్నంగా మాట్లాడారాయన. 2026 కల్లా భారీగా కొత్త ఇంజినీర్లను తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అది మనుషులకు ప్రత్యామ్నాయం కాదని పిచాయ్ భరోసానిచ్చారు.