ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత రక్షణ(Defence) లక్ష్యాలు మారిపోయాయి. దళాల(Army) కోసం 52 ప్రత్యేక ఉపగ్రహాల ప్రయోగం సిద్ధమైంది. భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు వీలుగా మూడు కంపెనీలకు కాంట్రాక్టుల్ని డిఫెన్స్ స్పేస్ ఏజన్సీ ఇచ్చింది. గతేడాది రూ.26,968 కోట్లను కేటాయించగా.. ఆ నిధుల్ని స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్(SBS) కోసం ఖర్చు చేస్తారు. చైనా, పాక్ లోని పెద్ద ప్రాంతాలు సహా హిందూ మహాసముద్రంపైన నిఘా ఉంటుంది. మానవ రహిత విమానాల్లా స్ట్రాటో ఆవరణలో పనిచేసే సూడో-శాటిలైట్లివి. మే 7 నుంచి 10 వరకు పాక్ పై జరిపిన దాడులకు కార్టోశాట్ వంటి శాటిలైట్లు వాడారు. డైరెక్ట్ అసెంట్ యాంటీ-శాటిలైట్ మిసైల్స్, కో-ఆర్బిటల్ ఉపగ్రహాలు, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ పరికరాలు, లేజర్లను చైనా తయారు చేస్తుండటంతో వాటిపై నిఘాకు ఈ ఉపగ్రహాలను మన దేశం రెడీ చేస్తోంది.