ఉద్యోగమో, ఉపాధో, ఆదరణ లేకనో కానీ… అమెరికా వెళ్లిన భారతీయులు ఆ దేశాన్ని అగ్రభాగాన నిలిపారు. ప్రపంచంలోనే అత్యంత పవర్ బాంబ్ B-2 స్టెల్త్.. 230 కిలోల గైడెడ్ లేదా 1,110 కేజీల B-83 అణు, థర్మోన్యూక్లియర్ బాంబులు వేస్తాయి. దీన్ని తయారు చేసింది మనోడే. అతనే ముంబాయికి చెందిన నోషిర్ షెరియార్జీ గొవాడియా. USకు అంత పరిజ్ఞానమిచ్చినా 81 ఏళ్ల వయసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1944 ఏప్రిల్ 11న పార్సీల్లో పుట్టి 15 ఏళ్లకే PhD పొందారు. 19 ఏళ్లకే US చేరి.. 1969 జులై 25న అక్కడి పౌరుడయ్యారు. నార్త్ రోప్ సంస్థ B-2 బాంబ్ ఇన్ ఫ్రారెడ్ షీల్డ్ ప్రొపల్షన్ సిస్టంలో ఆయనదే కీలక పాత్ర. సొంత కన్సల్టెన్సీ ప్రారంభిస్తే డబ్బు సరిపోక చైనాకు దగ్గరయ్యారు. https://justpostnews.com
చైనాకు 3 సార్లు వెళ్లి స్టెల్త్ ప్రొపల్షన్ వివరాలందిస్తే ఆ రోజుల్లోనే ఆయనకు 1.10 లక్షల డాలర్లు అందినట్లు అమెరికా గుర్తించింది. US తర్వాత 17 ఏళ్లకు ఈ స్టెల్త్ సిస్టంతో రష్యా, చైనా బాంబులు వచ్చాయి. చైనా వైమానిక స్థావరాల్లో B-2 క్లోన్ ను గుర్తించాక.. 2005 అక్టోబరు 13న గొవాడియా అరెస్టయ్యారు. గూఢచర్యం, రాజద్రోహం సహా 14 అభియోగాలపై దోషిగా తేలారు. ఇలా ఆయన మేధస్సు మనకూ దక్కక, ఆయనకూ పనికిరాక చివరకు ఎవరికో ధారాదత్తం చేసి ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.