అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు చేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.. అక్కణ్నుంచి తొలి సందేశం(Message) పంపించారు. ISS నుంచి భూమిని చూసిన కొద్దిమందిలో తానుండటం అదృష్టమన్నారు. ‘నేను 634వ వ్యోమగామిని.. ఇక్కడ ఉండటం ఒక గౌరవం.. ఇది నిజంగా అద్భుతం.. ఇప్పుడు మరింత మెరుగ్గా ఉన్నా.. ఇక్కడికి రావడానికి ఏ అంచనాలు పెట్టుకున్నానో అవి నిజమయ్యాయి..’ అంటూ తనను స్వాగతించిన వ్యోమగాములతో అన్నారు. సైన్స్, పరిశోధనపై ప్రయోగాలకు రాబోయే రెండు వారాలు కీలకమన్నారు.