తెల్లటి ధోతీ-కుర్తాతో.. ఇల్లాలితో కలిసి 93 ఏళ్ల వృద్ధుడు నగల షాపులోకి వచ్చాడు. అడుక్కోవడానికి వచ్చారని తొలుత అనుకోగా, చివరకు ఆయన ప్రేమ చూసి ఫిదా అయ్యారు. మహారాష్ట్ర జల్నా జిల్లా అంబోరా జహంగీర్ గ్రామ వాసి నివృత్తి షిండే.. ఆషాఢ ఏకాదశి వేళ భార్య శాంతబాయికి మంగళసూత్రం కొనాలనుకున్నారు. కాలినడకన పండరిపూర్ యాత్ర చేస్తున్న ఆ దంపతులు.. ఛత్రపతి శంభాజీనగర్లోని షాపులోకి వెళ్లారు. తాళి కోసం రూ.1,120ని ఇవ్వబోతుండగా, కేవలం రూ.20 మాత్రమే తీసుకుని నగ(Jewel)ను ఇచ్చేశాడా ఓనర్. ఈ వీడియోకు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. వీరికో కుమారుడున్నా అతనిపై ఆధారపడట్లేదు. కడవరకు కలిసి నడుస్తున్న ఈ జంట.. దుకాణ యజమాని దాతృత్వానికి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ దంపతుల అన్యోన్యత చూసి అక్కడివారి కళ్లు చెమర్చాయి. https://justpostnews.com