నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP)లో భాగంగా ఇక నుంచి ఏటా రెండుసార్లు పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు CBSE ఆమోదించింది. వచ్చే ఏడాది(2026) నుంచి ఈ విధానం అమలు కానుంది. తొలి దఫా(First Phase) పరీక్షలు ఫిబ్రవరిలో, రెండో విడతగా మేలో నిర్వహిస్తామని CBSE తెలిపింది. మొదటి విడత ఎగ్జామ్స్ తప్పనిసరి కాగా.. మలి విడతను ఆప్షనల్ గా ప్రకటించింది. రెండు విడతల్లోని స్కోరును పరిగణలోకి తీసుకోనుండగా.. ఏప్రిల్, జూన్ లో వరుసగా ఈ రెండింటి ఫలితాలు విడుదలవుతాయి. స్కోరు మెరుగుపర్చుకోవడం కోసమే ఆప్షనల్ ను ఇచ్చింది. ఒకేసారి పరీక్షలతో విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి ఉండగా.. వాటిని తగ్గించడమే ఈ విధానం లక్ష్యం. https://justpostnews.com