ఇక నుంచి ఏటా రెండుసార్లు పదోతరగతి పరీక్షలు నిర్వహించాలని CBSE నిర్ణయించడంతో అవి ఎలా ఉంటాయన్న ఆలోచన అందరిలో ఉంది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి.
ఆ గైడ్ లైన్స్ ఇవే…
@ ప్రతి ఒక్కరూ తొలి దశ పరీక్షలు రాయాల్సిందే. https://justpostnews.com
@ తొలి దశ రాసే వారందర్నీ అభ్యర్థుల జాబితా(List Of Candidates-LOC)లో చేర్చుతారు.
@ అవసరమైన వారితోనే రెండో దశ కోసం మళ్లీ LOC తయారు చేస్తారు. ఇందులో కొత్త అభ్యర్థులకు చోటుండదు.
@ రెండో దఫా పరీక్షలు రాయాలంటే తొలి విడతలో మూడు ఎగ్జామ్స్ అటెండ్ చేయాలి.
@ మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు(ఫస్ట్ ఫేజ్) మిస్ అయితే తప్పనిసరి రిపీట్(Essential Repeat)గా గుర్తించి, తర్వాతి సంవత్సరానికి అనుమతిస్తారు.
@ సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇతర లాంగ్వేజీలు కలిపి ఇంప్రూవ్ మెంట్ కోసం రెండో దశలో కేవలం మూడు సబ్జెక్టులకే అనుమతి ఉంటుంది.
@ ఫస్ట్ ఫేజ్ రాసే కంపార్ట్మెంట్ అభ్యర్థులకు సెకండ్ ఫేజ్ లోనూ ఆ కేటగిరీలోనే గుర్తింపు.
@ క్రీడాకారుల కోటాలో ప్రత్యేక మినహాయింపు ఉంది. తొలిదశ పరీక్షలు జరిగే సమయంలో పోటీలు ఉంటే రెండో దశకు అనుమతి.
@ శీతాకాల ప్రభావిత(Winter-Bound) స్కూల్స్ పిల్లలు ఏ దశలోనైనా పరీక్షలు రాసే ఛాన్స్.
@ రెండు దశల్లోనూ సబ్జెక్టులు మార్చుకునే అవకాశం ఉండదు.. కొన్ని కేసుల్లో తప్ప(CBSE పాలసీ).